top of page

దేశాన్ని తెగిడినా.. మోదీని పొగిడితే చాలా?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 7
  • 2 min read

కొన్ని సందర్భాల్లో రోగుల శరీరంలో అవయవాలు చిట్లిపోయి అంతర్గత రక్తస్రావం జరుగు తుంది. పరిస్థితి తీవ్రతకు అది చిహ్నం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుగా ప్రారం భించిన సుంకాల దాడి వల్ల ప్రపంచానికి.. ముఖ్యంగా అమెరికాకు అలాంటి ముప్పే పొంచి ఉందని జేపీ మోర్గాన్‌ బ్యాంక్‌ ప్రధాన ఆర్థికవేత్త బ్రూస్‌ కాస్‌మాన్‌ హెచ్చరించాడు. దేర్‌ విల్‌ బి బ్లడ్‌ (రక్త స్రావం జరగొచ్చు) అనే శీర్షికతో తమ ఖాతాదారులకు ఆయన వెల్లడిరచిన విశ్లేషణ ప్రపంచ వ్యాప్త వార్తగా నిలిచింది. ట్రంప్‌ దెబ్బకు ఎస్‌ అండ్‌ పి 500 సూచీలో కంపెనీల షేర్ల ధరలు ఒక్క రోజే 2.4 లక్షల కోట్ల డాలర్ల మేర పతనమయ్యాయి. ప్రపంచం మాంద్యంలోకి దిగజారే ముప్పు 40 నుంచి 60 శాతానికి పెరిగినట్లు జేపీ మోర్గాన్‌ హెచ్చరించింది. ఏప్రిల్‌ రెండో తేదీని అమెరికా విముక్తి దినంగా ట్రంప్‌ అభివర్ణించారు. అయితే అది ప్రపంచానికి దుర్దినంగా మారింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారిగా అమెరికా గృహస్తులు పెద్ద మొత్తంలో కాఫీ దగ్గర నుంచి కార్ల వరకు భారాలు మోయాల్సి వస్తుందని కాస్‌మాన్‌ చెప్పారు. అమెరికా విధానాల్లో ఎలాంటి మార్పులు లేకపోతే మాంద్యం ఈ ఏడాది ప్రపంచవ్యాపితం కావచ్చన్నారు. చర్యకు ప్రతిచర్య ప్రకృతి ధర్మం. ట్రంప్‌ బాణాల దెబ్బలు తిన్నవారు ప్రతి శస్త్రాలను సంధించకమానరు. వాటి పర్యవసానాలు అమె రికా.. కేవలం పెంగ్విన్‌ పక్షులు మాత్రమే ఉండే అంటార్కిటికా ప్రాంతంతో సహా యావత్‌ ప్రపంచం మీద ఉంటాయని విశ్లేషణలు వెలువడ్డాయి. మనతో సహా అనేక దేశాల స్టాక్‌ మార్కెట్లు కుదేల య్యాయి. దిగిన తర్వాత గానీ చెరువు లోతు తెలియదు, ఇల్లలకగానే పండుగ కాదు అన్నట్లుగా పన్నుల పెంపుదల ప్రకటన చేయగానే అంతా అయిపోయినట్లు భావించనవసరం లేదు. కెనడాపై విధించిన భారాలను అంగీకరించేది లేదని నలుగురు అధికారపక్ష సెనెటర్లతో సహా ప్రతిపక్షం పెట్టిన తీర్మానాన్ని అమెరికా సెనెట్‌ ఆమోదించింది. తనకున్న అధికారాలతో ట్రంప్‌ దాన్ని తోసిరాజనవచ్చు. కానీ తనకు సెగ తగిలిన కారణంగానే పన్నుల గురించి చర్చించటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రక టన చేయకతప్పలేదు. అయితే ఆయన సలహాదారులు మాత్రం అబ్బే అలాంటిదేం లేదు, ప్రకటించిన పన్ను మొత్తాలు బేరసారాలాడేందుకు కాదని వెంటనే వివరణ ఇచ్చారు. తమ దేశ తొత్తు ఇజ్రాయిల్‌ తో సహా వంద దేశాల మీద టారిఫ్‌ల తొడగొట్టడం ద్వారా ట్రంప్‌ ఒకవిధంగా అమెరికాను ఒంటరిని చేశాడనే చెప్పాలి. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చచ్చినట్లు, గడ్డిపోచలతో మదగజాన్ని బంధించినట్లు యావత్‌ దేశాలు తలచుకొంటే ట్రంప్‌ దిగిరాక తప్పదు. అయితే పరస్పరం విధించు కొనే పన్నులు సామాన్యులను బికారులను చేస్తాయే తప్ప పాలకవర్గాల ప్రతినిధులుగా ఉన్న కార్పొ రేట్లకు జరిగే నష్టమేమీ ఉండదు. ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల ద్వారా ప్రతి ఏటా అమెరికా ప్రభుత్వా నికి 600 బిలియన్‌ డాలర్ల అదనపు రాబడి వస్తుందని అంచనా. మరో విధంగా చెప్పాలంటే ఆ మొత్తంలో నామమాత్రపు భారాన్ని దిగుమతిదారులు, అత్యధిక భారాన్ని వినియోగదారులే భరిస్తారు. అప్పుడు అధికారంలో ఉన్నవారికి సెగ తగులుతుంది. అందుకే ఒక దశ తర్వాత ట్రంప్‌ వెనక్కు తగ్గ వచ్చనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి, తెగేదాకా లాగితే ఆ పెద్దమనిషి పదవికే ఎసరు వస్తుంది. కొత్త పన్నులతో అమెరికాలో ద్రవ్యోల్బణం 3 నుంచి 3.5 శాతానికి పెరుగుతుందని అంచనా. జేపీ మోర్గాన్‌, గోల్డ్‌మన్‌ శాచస్‌, మూడీస్‌, తదితర సంస్థల విశ్లేషకులు ఎటు తిప్పి ఎటు చెప్పినా వాణిజ్య యుద్ధం ఒక విషవలయం వంటిది. ద్రవ్యోల్బణం పెరిగితే, ధరలు పెరిగి వినియోగదారుల విశ్వాసం, కొనుగోలు శక్తి తగ్గుతుంది. అది వృద్ధిరేటు మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిరుద్యోగం పెరగడానికి దారితీస్తుంది. దశాబ్దాల తరబడి సాగుతున్న వాణిజ్య వివాదాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక మౌలిక అంశాలు బలహీనంగా ఉన్నాయి. ఈ సమయంలో గోరుచుట్టు మీద రోకటి పోటులా తగిలిన ట్రంప్‌ టారిఫ్‌లు దేనికి దారితీస్తాయో తెలియని అయోమ యానికి కారణం అవుతున్నాయి. ‘ప్రధాని మోదీ మంచివాడే.. భారతే చెడ్డది’ అన్న ట్రంప్‌ను ఆత్మ గౌరవం కలిగిన భారతీయులెవరూ సహించకూడదు. అసహ్యకర (డర్టీ) పదిహేను దేశాలు అంటూ మీడియాలో వర్ణిస్తున్నా మౌనమే. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా ట్రంప్‌ పన్నుల బాదుడు మనకు ప్రయోజనకరమా? హానికరమా? అన్నది చెప్పకుండా తారె 140 కోట్ల జనాభాకు జవాబు దారీ అని నరేంద్రమోదీ ఎలా చెప్పుకోగలరు?

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page