top of page

యువకుడు ఆత్మహత్య

  • Writer: ADMIN
    ADMIN
  • Dec 16, 2024
  • 1 min read
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

మంగువారితోట రామమందిరం వీధిలో నివసిస్తున్న యువకుడు శంకర్‌ (23) సోమవారం ఉదయం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు కుటుంబ తగాదాలేనని కారణమని సమాచారం. ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్న మహిళతో శంకర్‌కు సన్నిహిత సంబంధం ఏర్పడిరది. దీంతో ఆ మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page